ఎవరు గొప్ప
మనలో చాలా మందికి ఒక గొప్ప సందేహం కలుగుతూ వుంటుంది . దేవుళ్లలో ఎవరు గొప్ప ?.. శివుడే గొప్ప ..కాదు, విష్ణువే గొప్ప ...అదేమీ కాదు శక్తి లేనిదే ఈ ఇరువురూ దేనికీ పనికి రారు అని ఇలాంటి వాదనలు చూస్తూనే వుంటాము.. అసలు ఎవరిని పూజించాలి ? మనకెందుకు ఈ గందర గోళం ? ఇది కేవలం హిందువులలో మాత్రమె కనబడుతుంది .. ఎందువల్ల ? ఆత్మ, పరమాత్మ ల తత్త్వం తెలిసిన మన పెద్దలు మనకు ఏమి తెలియ జెప్పాలనుకున్నారు.. మూలాన్ని వదిలేసి ఈ వాదనలు అవసరమా అని ఒక ప్రశ్న ..కానీ భగవద్ గీత లో నేను ఎవరిని పూజించాలి అన్న సందేహానికి ఒక శ్లోకం ద్వారా ఆ కృష్ణ పరమాత్మ వివరించారు ...........
యే యదా మాం ప్రవద్యంతే తాంస్తదేవ భజామ్యహమ్ !
ఎవరు ఎవరిని పూజించినా చేరేది ఆ భగవంతునికే ... ఆయనను ఎవరు ఏ రూపంలో పూజిస్తే , ఆ రూపం లోనే పూజలు గ్రహిస్తాడు . తమలో ఎన్ని వైవిధ్యాలున్నా మానవులు ఆయన మార్గాన్నే ఆశ్రయిస్తున్నారు . ఎవరు, ఏ దేవతలను పూజించినా అదీ ఆయనకే చెందుతుంది . ఐతే తొలిపూజ సాక్షాత్తు గానూ, ఈ పూజ పరంపర గానూ చెందుతాయి.. అదీ తేడా .. కనుక మనకు నచ్చిన విధంగా పూజించుకోవడానికి ఆయనే అవకాశం ఇస్తున్నాడు .. ఈ గందర గోళానికి కారణం అజ్ఞానం తప్ప మరి ఇంకేమీ లేదు
యే యదా మాం ప్రవద్యంతే తాంస్తదేవ భజామ్యహమ్ !
మమ వర్త్మానువర్తనే మనుష్యః పార్ధ సర్వశః !!
యేప్య న్య దేవతా భక్తా యజంతే శ్రద్ధ యాన్వితాః !
తే పి మా మేవ కౌన్తేయ !యజన్త్య విధిపూర్వకం !!
ఎవరు ఎవరిని పూజించినా చేరేది ఆ భగవంతునికే ... ఆయనను ఎవరు ఏ రూపంలో పూజిస్తే , ఆ రూపం లోనే పూజలు గ్రహిస్తాడు . తమలో ఎన్ని వైవిధ్యాలున్నా మానవులు ఆయన మార్గాన్నే ఆశ్రయిస్తున్నారు . ఎవరు, ఏ దేవతలను పూజించినా అదీ ఆయనకే చెందుతుంది . ఐతే తొలిపూజ సాక్షాత్తు గానూ, ఈ పూజ పరంపర గానూ చెందుతాయి.. అదీ తేడా .. కనుక మనకు నచ్చిన విధంగా పూజించుకోవడానికి ఆయనే అవకాశం ఇస్తున్నాడు .. ఈ గందర గోళానికి కారణం అజ్ఞానం తప్ప మరి ఇంకేమీ లేదు
100% correct.
రిప్లయితొలగించండి