కొన్ని అమూల్యాలు...

సాధన ఇలా చేయవచ్చా?.......................
చిత్తవృత్తి నిరోధం,తపస్సు,అష్టాంగయోగాలు(యమ,నియమ,ఆసన,ప్రాణాయామ,ప్రత్యాహార,ధారణ,ధ్యాన,సమాధి),

సాధనాచతుష్టయం(నిత్యానిత్య వస్తువివేకం,ఇహాముత్రార్ధఫలభోగవిరాగం,శమాదిషట్క సంపత్తి,ముముక్షుత్వం),
యజ్ఞయాగాదులు, గురు సాంగత్యం....... అమ్మో! ఎన్నో భాద్యతల నడుమ, మనమున్న నేపద్యంలో ఈ విధమైన
ఆధ్యాత్మిక సాధన  సాధ్యమేనా? ముమ్మాటికి కాదు. మరి ఎలా? ఇలా సాధన చేయవచ్చా ?......

ప్రార్ధనలు,శత,సహస్ర నామావళిలు,పారాయణాలు చేయడం కంటే ఇలా చేస్తే ఎలా వుంటుందంటారు?
మనం (ఇక్కడ మనం అంటే మనిద్దరం కాదు. నాలాంటి వారందరూ) పూజించే "బాబా" చరితంను పారాయణం చేయడమే కాకుండా, మనం చదివిన ఆ చిన్నచిన్న ఘటనలలో అంతరార్ధం గ్రహించి, బాబా ఆ ఘటనల ద్వారా అందిస్తున్న ఆ జ్ఞానబోధను మన జీవన గమనంలో త్రికరణశుద్ధిగా అలవర్చుకుంటే........ ఎలా వుంటుందండీ?
ఉదాహరణకు కొన్ని..........
* ఒక పాలవర్తకురాలు- శివుని అభిషేకార్ధం పాలు ఆలస్యముగా పోస్తుందని పూజారి కోపడితే- పడవలో ఏరుదాటి

రావడం ఆలస్యమౌతుందని ఆమె చెప్పగా- "భవసాగరాన్ని తరింపచేసే భర్గుడి అభిషేకానికి పాలు తెస్తుంటే ఆలస్యం

ఎందుకౌతుంది....... నీవా భగవంతున్ని స్మరిస్తూ, పడవ ఆలస్యం అయిన ఏరుదాటి వచ్చేయగలవు భక్తి వుంటే" అని
పూజారి చెప్పగా ఆమె ఆ మర్నాటినుండి అలానే చేస్తుంది. అది తెలుసుకున్న పూజారి ఎంత ప్రయత్నించిన ఆమెలా

నీటిపై నడవలేకపోతాడు. ఆమెకి భగవంతునిపై వున్న విశ్వాసం పూజారికి లేదు. ఈ కదా చెప్తూ బాబా

అంటారు---"ఎంతో శ్రద్ధ,విశ్వాసాలు భగవంతుని పట్ల వుండాలి, అప్పుడే తరిస్తారు" అని. దీనీని అర్ధం చేసుకొని
మనమూ శ్రద్దావిశ్వాసాలుతో వుండడం.....
* శ్యామా ఇంట్లో దొంగలు పడి రెండువందలరూపాయాలు తీసుకుపోగా, బాబా దగ్గరకు

శ్యామా వచ్చి దుఃఖించినప్పుడు- "ఎందుకు దిగాలు పడతావు, ఎవరి తలరాత ఎలావుంటే అలా జరుగుతుంది. మన

చేతనిబట్టే తలవ్రాత వుంటుంది. కర్మఫలాన్ని అనుభవించక తప్పదు" అని బాబా చేసిన హితబోధ వలన

కర్మాచరణపట్ల ఎంతటి స్పృహ కావాలో, కర్మఫలితం ఎంత ఖచ్చితంగా వుంటుందో తెలుసుకొని, చేసే పనులయండు జాగురుకతగా వుండడం.....
* ఇద్దరువ్యక్తులమధ్య వాక్కలహం జరిగి ఎన్నో దూషణలతో నిందింపబడినవ్యక్తి బాబా ముందు విలపిస్తే-

"అమాయకుడా! నీలో మలినాలని వాడి నాలుకతో శుభ్రపరిచాడు,అందుకు నీవెళ్ళి కృతజ్ఞతలు చెప్పిరా, నీ ప్రారబ్దం

తొలగించినందుకు", అన్న ఘటన ద్వారా నిందపడిన దుఃఖించకూడదని, అలానే నిందించిన వ్యక్తితో "బురదలో

పందికి, నీకూ తేడా లేదు".... అని అన్న ఘటన ద్వారా పరనింద పనికిరాదని గ్రహించి, పరనింద చేయకుండా,

మాటపడిన సమన్వయముగా వుండడం.....
* పండరీపురం ప్లీడరుతో- "ఎదుట పాదాభివందనాలు,చాటున తులనాడుతూ ఉంటారని--- అనే ఘటనద్వారా

చాటుమాటు మాటలు తగవని, పరోక్ష నిందలు పనికిరావని,ఎవరి నమ్మకాన్ని కించపరచరాదని, ఇవ్వాళ మనం

ఎవర్నికాదనుకుంటామో, రేపు వాళ్ళనే ఆశ్రయించాల్సి రావచ్చునని తెలియజెప్పారు. దీనీని బట్టి ఎలా వుండాలో

అవగాహన చేసుకొని అలా వుండడం......
* ఓసారి రామభక్తుడి పరోక్షములో- అతని విష్ణుసహస్రనామ పుస్తకంను శ్యామాకు బాబా బహూకరించడం, తన

పుస్తకం శ్యామా దగ్గర చూసి ఆ భక్తుడు శ్యామాతో గొడవపడడం - అప్పుడు బాబా "ఓయి రామభక్తుడా! డబ్బు పెడితే

మరోపుస్తకం దొరుకుతుంది,కానీ మనస్సును గాయపరిచే మాటలంటే ఆ మనిషి మనతో స్నేహం ఇక చేయడు

సుమా. భక్తులకు కావల్సింది... 'అది నాది, ఇదీ నీది' అనే మమత కాదయ్యా. సాటి మానవులపట్ల, సమస్తజీవులపట్ల
"సమత" కావాలి. అంతా రామమయం,జగమంతా రామమయం అని భావించగలగాలి. నీకీ విషయం

తెలియజెప్పడానికే నేనీ పుస్తకాన్ని శ్యామాకిచ్చాను" అని అంటారు. దీనిబట్టి మమతతో ఇహమందు

చిక్కుకోకా,సమస్తం సర్వేశ్వరుడే అన్న భావనతో అందరితో సఖ్యతగా వుండడం......
*హేమడ్ పంత్ శనగలు దాచుకోవడం బయటపెడుతూ - "తినే ముందు నాకు పెట్టడం గానీ, తలుచుకోవడం గానీ

చేశావా" అన్న ఘటన ద్వారా ఏదైనా తినే ముందు భగవంతున్ని స్మరించుకోవడం, భగవంతునికి నివేదించడం,

దగ్గర ఎవరైనావుంటే వారికి పెట్టి తినడం అలవాటు చేసుకోవడం.......
* వీరభద్రప్ప, బసప్పల కధవలన శత్రుత్వాల నుంచీ, బంధాలనుంచీ, రుణాలనుంచీ ఈ జన్మలోనే విముక్తి పొందాలి,

అలా కానిపక్షంలో, అవన్నీ మరుజన్మకి కారణమవ్వడమే కాక, ప్రారబ్ద రూపంలో మనల్ని తరుముతాయని గ్రహించి, సంచితకర్మలయందు శుద్ధతగా వుండడం......
* ఓ లోభి అయిన ధనవంతుడు సత్వర బ్రహ్మజ్ఞానమును ప్రసాదించమని కోరినప్పుడు - అతనితో " దురాశా, లోభ

భూయిష్టుడవైన నువ్వు, ముందు ఆ రెండింటిని వదులుకో. ఎవరి మనస్సైతే ధనధారాపుత్రేషణత్రయంలో

తగులుకోనివ్వకుండా, తాను బద్ధుడినని గ్రహించి, తద్విముక్తిని మాత్రమే ఆశించి, బాహ్యాన్ని విస్మరించి తన లోపలి

ఆత్మను చూడగలుగుతాడో వాడికే బ్రహ్మజ్ఞానం లభిస్తుంది.అంతరముఖానుభవం నుంచే ఆత్మవిద్య

అలవడుతుంది.సత్యం,తపస్సు,లోచూపు,బ్రహ్మచర్యం అనే నాలుగింటి సంయోగాన్ని పాటించనిదే త్యాగి కాలేడు.

త్యాగి కానివాడు యోగి కాలేడు. యోగి కానివాడికి సమదృష్టి కలగదు.సమదృష్టి లేనివాడికి ఆత్మసాక్షాత్కారం

కలగదు" అన్న బాబా బోధను అర్ధం చేసుకొని సమదృష్టిని అలవర్చుకోవడం, ఏది పట్టుకోవాలో,ఏది పరిత్యజించాలో

తెలుసుకొని అలా వుండడం.....
                                 ఇలా కొన్నిటినైనా అర్ధం చేసుకొని అలవర్చుకుంటే.......... జీవిత చరమాంకంలో బాబా

బాటలో బాబా చెప్పినట్లు కొంతైన ఆచరించామన్న ఆనందముంటుంది. ఈ విధమైన సాధనతో ముక్తి

పొందకపోయినను మంచిగా జీవించామనే తృప్తి వుంటుంది. మరుజన్మలో ఈ 'మంచి' ప్రారబ్దఫలమై ఆధ్యాత్మిక 

ఆకాంక్షను,అభివృద్ధిని కల్గించి ఆత్మసాక్షాత్కారమును కలిగించవచ్చు. మరి మీరేమంటారు రుక్మిణీగారు? ఈ సాధన

వలన ఓ విధమైన సాత్వికత, సఖ్యత,సత్యగుణం, పవిత్రత..... ఒక్కమాటలో చెప్పాలంటే సత్వగుణం అలవడుతుందని

నాకన్పిస్తుంది. మరి మీరు నాతో ఏకీభవిస్తారా?
"ఇలా బాబాను ఆరాధించేవారు బాబా బోధలను, కృష్ణుని ఆరాదించేవారు కృష్ణుడు చెప్పినవాటిని, 

రామున్ని ఆరాదించేవారు రాముని నడవడికను, బుద్దునిల బౌద్ధులు, మహావీరునిలా జైనులు, జీసస్ 

చెప్పినట్లుగా క్రైస్తవులు......... ఇలా కొంతవరకైన అనుసరిస్తే ఎలా వుంటుందంటారు మన భారతావని?

స్వర్గసీమలా కదూ ........"............ ఇవే హరిప్రియ గారి అమూల్య వాక్యాలు....

కామెంట్‌లు

  1. ఒక ఆనందం మళ్ళి ...మీరు ఇంకా ఎన్నో రాయాలి
    లక్ష్మీ రాఘవ

    రిప్లయితొలగించండి
  2. అమ్మా రుక్మిణి దేవి !!
    శిరసా అభివందనం తల్లి !!
    సాయి రాం !! జై సాయి రాం !!

    రిప్లయితొలగించండి
  3. ఆంతా పెద్దల ఆశీర్వచనం ..ఆ భగవంతుని దయ .. మీకు నా పాదాభివందనం ...........మీ పేరు తెలియదు ఎందుకో ఏమో గారు ...

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువు అవసరం ................

భారతీయం: ఓం శ్రీ గురుభ్యోన్నమః ఓం శ్రీ మహా గణాధిపతయే నమః నూ...

నాన్న మాట అమ్మకి వేదం