మానవ గీత
జాతస్య హి ధ్రువో మృత్యు; : ధృవం జన్మ మృతస్య చ1 తస్మా ద పరిహార్యే ర్ధే న త్వాం శోచితుమర్హసి౧౧ పుట్టిన వానికి మరణము తప్పదు. మరణించిన వానికి పునర్జన్మ తప్పదు . కనుక అపరిహార్యములైన ఈ విషయము ల యందు శోకించదగదు .. చాలా బాగా చెప్పాడు కదండీ శ్రీకృష్ణ పరమాత్ముడు ...ఇంకో విషయం కూడా చెప్పాడండి....... ప్రాణులు అన్నియు పుట్టుకకు ముందు ఇంద్రియ గోచరములు కావు. {అవ్యక్తములు }.. మరణానంతరము కూడా అవి అవ్యక్తములే ......ఈ జనన మరణముల మధ్య కాలము నందు మాత్రమె అవి ప్రకతితములు { ఇంద్రియ గోచరములు }. అగుచుండును . ఇట్టి స్థితిలో వాటికి పరితపించుట నిష్ప్రయోజనము .......... ఈ విషయాలు తెలిసి నప్పటికీ మనం దుఖించక మానము .. అందుకే మనం మనుషులు గానే మిగిలిపోతాము .. ఏదీ శాశ్వతం కాదు .. ఇది అందరికి తెలిసిన విషయమే .. ఒక కుర్చీ కాలు విరిగితే మేకులు కొట్టో లేక ఫెవికాల్ అంటించో దానిని బాగు చేసినట్లే , మన శరీరం లోని ఎ భాగాని కైనా దెబ్బ తగిలితే ఆపరేషన్ చేసి కుట్ల ద్వారానో లేక స్క్రూల ద్వారానో దాని బాగు చేస్తాము .. మరి కర్రకి మన శరీరానికి తేడా ఏమిటండి ? ...